News October 12, 2024
నల్గొండ: ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 17, 2025
నల్గొండ ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దీంతో ఈ నకిలీ ఐడీ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్లకు, రిక్వెస్ట్లకు స్పందించవద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఆకతాయిలు ఇలాంటి ఫేక్ ఐడీలు సృష్టించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News November 17, 2025
నల్గొండలో నూతన డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఈ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, గాదే వినోద్ రెడ్డి, ప్రమీల సహా జిల్లా గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
News November 17, 2025
GREAT.. కనగల్ నుంచి నేషనల్ పోటీలకు..

కనగల్ మండలం జి.యడవల్లి హైస్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థిని పి. దీక్షిత అండర్- 17 బాలికల జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో దీక్షిత ప్రతిభ కనబరిచింది. ఈనెల 25 నుంచి 29 వరకు కర్ణాటకలోని తుములూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుందని పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, పీడీ నారాయణ కవిత తెలిపారు.


