News March 8, 2025
నల్గొండ: భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరణ

నల్గొండ పట్టణంలోని ఉస్మాన్పురాకు చెందిన హై స్కూల్ అటెండర్ <<15575023>>మహమ్మద్ ఖలీల్<<>> గతనెల 25న మరణించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల సమయంలో ఖలీల్ ఒంటిపై గాయాలను చూసిన కుటుంబ సభ్యులు వన్ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో హత్యేనని రిపోర్టు వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా భార్యే హత్య చేసినట్లు తేలింది. హత్య భార్య చేసిందా లేదా ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 19, 2025
NLG: మఖానా సాగుపై కసరత్తు

జిల్లాలో మఖానా సాగు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బిహార్లో మాత్రమే రైతులు చేస్తున్న మఖానా సాగుపై జిల్లా అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా వానాకాలం నుంచి మఖానా సాగు చేయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల పర్యవేక్షణలో కార్యాచరణ రూపొందించారు.
News March 19, 2025
నల్గొండ: బడ్జెట్లో వరాలు కురిపిస్తారా..!

రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని 11 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే డిండి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపుపై ఆయకట్టు రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధి, ఏఎంఆర్పీ పరిధిలోని కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయించాల్సి ఉంది. పాత ఎత్తిపోతల పథకాలకు ఫండ్స్ ఇవ్వాలన రైతులు కోరుతున్నారు.
News March 19, 2025
NLG: జీపీ కార్మికుల వేతన వెతలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు రాక ఆర్థిక కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్మికుల పట్టించుకునే నాథులే లేక దుర్భరమైన బతుకులు.. ఇది NLG జిల్లాలో 856 గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల దుస్థితి. సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. 3నెలలుగా వేతనాలు పెండింగ్లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.