News March 18, 2025

నల్గొండ: మద్దతు ధర పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

image

2024 -25 రబీ ధాన్యం మార్కెట్‌కు రానున్న నేపథ్యంలో రబీ ధాన్యం సేకరణకు పౌరసరఫరాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జిలకు ఉద్దేశించి శనివారం ఉదయాదిత్య భవన్‌లో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరణ చేశారు.

Similar News

News March 19, 2025

నల్గొండ: బడ్జెట్‌లో వరాలు కురిపిస్తారా..!

image

రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని 11 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే డిండి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపుపై ఆయకట్టు రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధి, ఏఎంఆర్పీ పరిధిలోని కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయించాల్సి ఉంది. పాత ఎత్తిపోతల పథకాలకు ఫండ్స్ ఇవ్వాలన రైతులు కోరుతున్నారు. 

News March 19, 2025

NLG: జీపీ కార్మికుల వేతన వెతలు

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు రాక ఆర్థిక కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్మికుల పట్టించుకునే నాథులే లేక దుర్భరమైన బతుకులు.. ఇది NLG జిల్లాలో 856 గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల దుస్థితి. సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. 3నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.

News March 19, 2025

NLG: ఈనెల 22న ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వయోవృద్దులు, దివ్యాంగుల కోసం ఈనెల 22న నల్గొండ కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సాయంత్రం 3గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

error: Content is protected !!