News March 31, 2025
నల్గొండ: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాటిగూడెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. రోజూ తాగి వస్తున్న భర్తతో భార్య అరుణ(35) సోమవారం గొడవకు దిగింది. దీంతో ఆవేశానికి గురైన భర్త గొడ్డలితో ఆమెపై దాడి చేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 6, 2025
నిర్మల్: త్వరలో ఈ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ సేవలు

నిర్మల్ డిపో నుంచి వివిధ దేవాలయాల యాత్రలకు త్వరలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ పండరి తెలిపారు. పండరి పూర్, తుల్జాపూర్, కొలహాపూర్, భద్రాచలం, సింహచలం, అన్నవరం రామేశ్వరం, శ్రీరంగం, కంచీపురం, అరుణాచలం, శబరిమలై నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీని ఆధారించాలని ఆయన కోరారు.
News November 6, 2025
మ్యాగజైన్ ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం కలెక్టరేట్లో మెడి వాయిసెస్ వైద్య రంగ మ్యాగజైన్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య రంగంలో అవగాహన పెంచే ప్రయత్నాలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీధర్, మెడి వాయిసెస్ మ్యాగజైన్ కో-ఫౌండర్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
News November 6, 2025
పెద్దపల్లి: భవన నిర్మాణ కార్మికులకు మరణ సహాయం పెంపు: హేమలత

భవన నిర్మాణ రంగ కార్మికులకు మరణ ఉపశమన సహాయం పెంచినట్లు పెద్దపల్లి సహాయ కార్మిక అధికారిణి హేమలత తెలిపారు. ప్రమాద మరణ సహాయం రూ.10లక్షలకు, సాధారణ మరణ సహాయం రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం బీమా నియంత్రణ సంస్థ మార్గదర్శకాల మేరకు అమలవుతుందని తెలిపారు. వివాహ, ప్రసూతి ప్రయోజనాల కోసం “మీ సేవ” ద్వారా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.


