News March 31, 2025

నల్గొండ: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

image

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాటిగూడెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. రోజూ తాగి వస్తున్న భర్తతో భార్య అరుణ(35) సోమవారం గొడవకు దిగింది. దీంతో ఆవేశానికి గురైన భర్త గొడ్డలితో ఆమెపై దాడి చేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 25, 2025

NPDCL కరీంనగర్ సర్కిల్ POగా మునీందర్

image

NPDCL KNR సర్కిల్ ఇన్‌ఛార్జ్ పీవోగా S.మునీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పీవోగా పనిచేసిన B.చంద్రయ్యకు అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో పోస్టింగ్ ఇస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో PO పోస్టుకు ఖాళీ ఏర్పడడంతో మునీందర్‌కు ఇన్‌ఛార్జ్ పీవోగా బాధ్యతలు అప్పగించారు. ఒక ADEకి DEగా, 10 మంది ఏఈలకు ADEలుగా, 5 మంది సబ్ ఇంజినీర్లకు ఏఈలుగా పదోన్నతి కల్పించారు.

News November 25, 2025

ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

image

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>

News November 25, 2025

ఉంగుటూరు: సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల డిసెంబర్ 1న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఉంగుటూరు నియోజకవర్గంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, సీఎం పాల్గొనే సభ ప్రాంగణాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి, స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు మంగళవారం ప్రాంతాన్ని పరిశీలించారు.