News January 31, 2025

నల్గొండ: మాజీ సర్పంచ్ హత్య కేసులో ఏడుగురి అరెస్టు

image

శాలిగౌరారం మండలం <<15238534>>ఉప్పలంచ మాజీ సర్పంచ్<<>> బండారు మల్లయ్య<<15212850>> హత్య కేసులో<<>> ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘పాత కక్షలతో ఈ నెల 21న మాజీ సర్పంచ్ బండారు మల్లయ్యపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను మృతిచెందాడు. 12 మందిని నిందితులను గుర్తించి ఏడుగురిని అరెస్టు చేశాం. మిగతా ఐదుగురిని త్వరలో పట్టుకుని రిమాండ్ కు పంపుతాం’ అని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. 

Similar News

News February 19, 2025

దామరచర్ల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పరిసరాలు, వంటగది, తరగతి గదులు, మరుగు దొడ్లు పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తనిఖీ చేశారు. నెలలోపు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

News February 19, 2025

ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ BJP: మంత్రి కోమటిరెడ్డి

image

బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దురాజ్‌పల్లిలో మాట్లాడుతూ.. ‘ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ.. వాళ్లకు మా గురించి మాట్లాడే అర్హత లేదు, మాది సెక్యులర్ ప్రభుత్వం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మాకు అన్ని పండుగలు సమానమే, ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం, వచ్చే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుంది’ అని మంత్రి అన్నారు.

News February 19, 2025

NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.

error: Content is protected !!