News June 3, 2024

నల్గొండ: మిషన్ భగీరథ ట్యాంక్‌లో పడి వ్యక్తి మృతి

image

పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై తేలాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండలోని 28వ వార్డు హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్(26)గత నెల 24న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. ఈరోజు పట్టణంలోని 12వ వార్డులో గల హిందూపూర్ మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై కనిపించాడు.

Similar News

News October 17, 2025

NLG: ఆ 7 దుకాణాలకు బోణీ కాలేదు!

image

జిల్లాలో 154 మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో 7 మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తులు బోణీ కాలేదు. ఇందులో దేవరకొండలో 70, చండూరులో 106, 108వ నెంబర్, ఓపెన్ కేటగిరి షాపులు, హాలియాలోని 128, 129 , 130 ఎస్సీ రిజర్వు, నాంపల్లిలోని 14వ నెంబరు ఎస్సీ రిజర్వ్ షాపులు ఉన్నాయి. గతంలో 757 దరఖాస్తులు రాగా.. ఇప్పుడు అందులో సగం కూడా దరఖాస్తులు రాకపోవడం గమనార్హం.

News October 17, 2025

నల్గొండ జిల్లాలో 1000 దాటిన దరఖాస్తులు

image

నల్గొండ జిల్లాలోని మద్యం దుకాణాలకు గురువారం మరో 496 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా, నేటి వరకు 1052 దరఖాస్తులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఆయన చెప్పారు.

News October 17, 2025

నల్గొండ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వానకాలం ధాన్యం సేకరణపై కలెక్టరేట్‌లో గురువారం ఆమె కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 92814 23653కు ఫిర్యాదులను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.