News June 3, 2024
నల్గొండ: మిషన్ భగీరథ ట్యాంక్లో పడి వ్యక్తి మృతి

పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై తేలాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండలోని 28వ వార్డు హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్(26)గత నెల 24న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. ఈరోజు పట్టణంలోని 12వ వార్డులో గల హిందూపూర్ మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై కనిపించాడు.
Similar News
News November 18, 2025
NLG: ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం తింటారు!

2026 జనగణన నేపథ్యంలో తిప్పర్తి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన సర్వే చేస్తున్నారు. ఇంటి యజమాని పేరు, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? రైస్ తింటారా లేదంటే గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలు తింటారా? ఉండేది పెంకుటిల్లా? వంటి వివరాలు అడిగి వెంట వెంటనే యాప్లో నమోదు చేస్తున్నారు.
News November 18, 2025
NLG: ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం తింటారు!

2026 జనగణన నేపథ్యంలో తిప్పర్తి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన సర్వే చేస్తున్నారు. ఇంటి యజమాని పేరు, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? రైస్ తింటారా లేదంటే గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలు తింటారా? ఉండేది పెంకుటిల్లా? వంటి వివరాలు అడిగి వెంట వెంటనే యాప్లో నమోదు చేస్తున్నారు.
News November 18, 2025
NLG: యాసంగికి ఢోకా లేదు..!

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.


