News February 1, 2025

నల్గొండ: రాజకీయ పార్టీల నేతలతో సమావేశం

image

నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లో జిల్లాలోని రాజకీయ పార్టీ నేతలతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నారు. పోలింగ్ స్టేషన్‌ల ఖరారుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలు పై రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని రాజకీయ నేతలకు అధికారులు తెలిపారు.

Similar News

News December 10, 2025

NLG: అన్న పైసలు వేసిన.. రేపు వస్తున్నావా..!

image

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో పట్టణాల్లో ఉన్న పల్లె ఓటర్లకు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తెగ ఫోన్లు చేస్తున్నారు. “అన్న ఎట్లున్నవే.. పైసలేసిన రేపు వచ్చి ఓటేయండి మీ ఓటే నా గెలుపును డిసైడ్ చేస్తుంది.. తప్పకుండా రావాలి” అని వేడుకుంటున్నారు. ఇదే అదనుగా ఓటర్లు తమ ట్రావెలింగ్, ఇతర ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

News December 10, 2025

నల్గొండ: అప్పులు.. పదవి కోసం తిప్పలు

image

నల్గొండ జిల్లాలోని 869 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు ఎనలేని సాహసం చేస్తున్నారు. ఆర్థిక స్తోమత సరిగా లేకున్నా, తర్వాత సంపాదించుకోవచ్చనే ఆశతో అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నిలిచారు. ప్రస్తుతం పంటల దిగుబడి అంతంత మాత్రంగా ఉండటంతో, రెండో పంట వచ్చాక తిరిగి చెల్లిస్తామనే హామీతో అప్పులు తీసుకుని ప్రచారానికి ఖర్చు చేస్తున్నారు. ఈ అప్పుల పోరు ఎన్నికల వాతావరణాన్ని మరింత రంజుగా మారుస్తోంది.

News December 10, 2025

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

జిల్లా పరిధిలోని మూడు దశల్లో 869 గ్రామపంచాయతీలో జరిగే ఎన్నికలకు 1,680 పోలీస్ సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే 100కి సమాచారం అందించాలని కోరారు.