News March 17, 2025
నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 18, 2025
KMR: వైకల్యాన్ని ఓడించి..ఉద్యోగం సాధించి..! అంతే గాక..

ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించారు జుక్కల్ మండలం మొహ్మదాబాద్ వాసి ముక్తబాయి. పుట్టుకతోనే అంధురాలైనా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ఇటీవల గ్రూప్- 4కు ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంచర్ల రెసిడెన్షియల్ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతే గాక తన పింఛన్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు వినతి పత్రం అందించి ఆదర్శంగా నిలిచారు.
News March 18, 2025
రాజమండ్రి: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యుల క్రీడా పోటీలు

ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు ఆహ్లాదాన్ని ఇచ్చే దిశగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడా పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను శాప్ ఛైర్మన్ రవి నాయుడుతో కలిసి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం పర్యవేక్షించారు. ఈ క్రీడా పోటీల్లో 173మంది ఎమ్మెల్యేలు, 31మంది క్రికెట్, 25 మంది బ్యాట్మెంటిన్ వాలీబాల్ ఆడనున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు.
News March 18, 2025
ఎన్టీఆర్: అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ (2022, 23, 24 బ్యాచ్లు) రెగ్యులర్, సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 28లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షల షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.