News November 12, 2024
నల్గొండ: రైతన్నకు ‘మద్దతు’ ఏది?

ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు NLG, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ధాన్యం క్వింటాకు రూ.2150 నుంచి 2300 వరకే చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. కొనుగోలు ప్రారంభంలో రూ.2500 పైచిలుకు చెల్లించి కొనుగోలు చేసిన మిల్లర్లు.. మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతుండడంతో ధాన్యం ధరలు పూర్తిగా తగ్గించు కొనుగోలు చేస్తున్నారని రైతులకు తెలిపారు.
Similar News
News December 11, 2025
BREAKING.. ఎల్లమ్మగూడెం సర్పంచ్గా వాణి సందీప్ రెడ్డి

తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన ఊట్కూరి వాణి సందీప్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన మామిడి నాగలక్ష్మిపై 459 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఘన విజయంతో సర్పంచ్ మద్దతుదారులు గ్రామంలో బాణసంచా కాల్చి, డప్పుల మోతతో సంబరాలు నిర్వహించారు.
News December 11, 2025
నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

అంతయ్యగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన కన్నెబోయిన లక్ష్మయ్య విజయం సాధించారు. ఆయన తన సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి బ్రహ్మచారిపై 21 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ మద్దతుదారులు బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు.
News December 11, 2025
MGU పీజీ సెమిస్టర్-3 పరీక్షల టైం టేబుల్ విడుదల

MGU పరిధిలో నిర్వహించనున్న పీజీ (MA, M.Com, M.Sc, M.S.W) సెమిస్టర్-3 రెగ్యులర్ పరీక్షల టైం టేబుల్ను డా.ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల జనవరి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత టైం టేబుల్ను విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ తేదీలను గమనించాలని కోరారు.


