News February 12, 2025

నల్గొండ: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన తల

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వివరాలిలా.. సూర్యాపేట మండలానికి చెందిన మల్లమ్మ ఆటో చెట్టుకి ఢీకొనడంతో మృతిచెందింది. HYDకి చెందిన ఇస్లాం WGL వెళ్తున్న క్రమంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో మరణించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయి మహిళ మృతి చెందింది. ఈఘటన అడ్డగూడురులో జరిగింది. ఆమె దాచారం ZPHS పాఠశాల టీచర్‌ జబీన్‌గా పోలీసులు గుర్తించారు.

Similar News

News February 12, 2025

కొత్తూరు జెపి దర్గాను సందర్శించిన హీరో విశ్వక్ సేన్

image

ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. త్వరలో విడుదల కానున్న మూవీ ‘లైలా’ విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి ఈ దర్గాకు వస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయానని ఇప్పుడు లైలా విడుదల సందర్భంగా వచ్చినట్లు చెప్పారు.

News February 12, 2025

రాష్ట్రస్థాయి పోటీల విజేతగా నిర్మల్ బిడ్డ

image

HYDలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో నిర్మల్ పట్టణానికి చెందిన అనుముల శ్రీవైభవి రాణించింది. అండర్ 13 విభాగంలో రాష్ట్రస్థాయి సింగిల్స్,  డబుల్స్‌లో విజేతగా నిలిచింది. మెడల్స్ సాధించిన శ్రీవైభవిని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ రాణి అభినందించారు.

News February 12, 2025

కామారెడ్డి: క్వింటాకు రూ.7550 చెల్లిస్తాం: మార్కోఫెడ్ జిల్లా మేనేజర్

image

కందులు క్వింటాకు మద్దతు ధర రూ.7,550 చెల్లిస్తామని మార్కోఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 56,189 ఎకరాల్లో కంది పంటను సాగు చేయడంతో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోర్లం, తాడ్వాయి, గాంధారి, పద్మాజీవాడి వద్ద కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!