News April 4, 2024

నల్గొండ: వాటర్ ట్యాంకులో కోతుల మృతి.. KTR ట్వీట్

image

నందికొండలో వాటర్ ట్యాంక్‌లో వానరాల కళేబరాల మృతి ఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థతి అన్నారు. తాగునీటి ట్యాంకుల శుభ్రత, నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలన అస్తవ్యస్తమైందని మండిపడ్డారు.

Similar News

News April 20, 2025

ఒకే కాన్పులో ముగ్గురు జననం

image

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండటంతో ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు.

News April 20, 2025

NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

image

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్‌కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు

News April 20, 2025

MGU తరఫున ప్రాతినిధ్యం వహించనున్న ప్రవళిక

image

ఒరిస్సా కళింగ విశ్వవిద్యాలయం వేదికగా జరగనున్న ఇండియన్ యూనివర్సిటీస్ ఎంపికలకు మహిళా విభాగం 100, 200 మీటర్ల పరుగు పందేనికి NLG సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎన్.ప్రవళిక MGU తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇవాళ ఉదయం విశ్వవిద్యాలయంలో జరిగిన ఎంపికల్లో ప్రవళిక 100 మీటర్ల పరుగు పందెంలో 12.30 సెకండ్లలో, 200 మీటర్ల 25.60 సెకండ్లలో పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

error: Content is protected !!