News March 5, 2025
నల్గొండ: విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలి: జిల్లా ఎస్పీ

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన.. పరిక్షా కేంద్రాల వద్ద 163 BNSS(144 సెక్షన్) అమల్లో ఉంటుందన్నారు. 57 పరీక్ష కేంద్రాల్లో 28,722 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానునట్లు తెలిపారు. ఈ సమయంలో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలన్నారు.
Similar News
News March 6, 2025
BREAKING: నాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నాంపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బుధవారం రాత్రి వడ్డేపల్లి రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిపల్లి వద్ద బత్తాయి తోటలో పనులు ముగించుకుని తన భార్యతో కలిసి వస్తుండగా నాంపల్లి మండలం వడ్డేపల్లి మూలమలుపు వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. నాంపల్లికి చెందిన పూల సత్తయ్య, సత్తమ్మ కుమారుడు రవిగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 5, 2025
NLG: ‘సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి’

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. సైబర్ జాకృత్క దివాస్ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పని రకాలు ఉంటాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.
News March 5, 2025
నల్గొండ జిల్లాలో 619 మంది పరీక్షకు గైరాజరు.!

నల్గొండ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 12,675 మంది జనరల్ విద్యార్థులు, 2010 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 14,685 మంది హాజరు కావాల్సి ఉండగా.. జనరల్ విద్యార్థులు 12,272 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,794 మంది విద్యార్థులు కలిపి 14 వేల 66 మంది హాజరయ్యారు. 403 మంది జనరల్ విద్యార్థులు, 216 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 619 గైర్హాజరయ్యారు.