News February 11, 2025

నల్గొండ: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి 

image

నేరడిగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామ శివారులో విషాదం జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కేతావత్ చెన్నా పొలం దగ్గర ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. అడవి పందుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగలడంతో ఈ విషాదం జరిగింది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 12, 2025

చెరువుగట్టు హుండీ ఆదాయం రూ. 16,45,100

image

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. పది రోజులకు గాను అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.3,19,600లు, స్వామివారి హుండీ ఆదాయం రూ. 13,25,500లు లభించినట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ నల్గొండ డివిజన్ పరిశీలకురాలు బి. సుమతి, దేవస్థాన పర్యవేక్షకులు జి. తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

News February 11, 2025

NLG: రూ.113.33 కోట్ల రైతు భరోసా జమ

image

జిల్లాలో రెండెకరాలలోపు భూమి ఉన్న 1,85,545 మంది రైతుల ఖాతాల్లో రూ.113,33,74,857 రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. ఇంతకు ముందు జనవరి 26న 31 మండలాల్లో ఎంపిక చేసిన 31 గ్రామాల రైతులకు 35,568 మంది రైతుల ఖాతాల్లో 46,93,19,160 జమ చేసింది. మిగతా రైతులకు దశలవారీగా డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

News February 11, 2025

దామరచర్ల పీహెచ్సీని తనిఖీ చేసిన ఇలా త్రిపాఠి 

image

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రికార్డులన్నింటినీ సక్రమంగా నిర్వహించాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె దామరచర్ల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వైద్యుల హాజరు రిజిస్టర్, మందుల రిజిస్టర్లను, అలాగే స్టాక్ తదితర రిజిస్టర్లు అన్నిటిని తనిఖీ చేశారు. 

error: Content is protected !!