News March 24, 2025

నల్గొండ: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. HYDకి చెందిన ఉదయ్‌కిరణ్ నేరేడుగొమ్ము మండలం పుష్కర ఘాట్‌లో మునిగి చనిపోయాడు. నల్గొండ మండలానికి చెందిన నవీన్ కుమార్, రాఘవేంద్ర ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెంలో కారు, బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.

Similar News

News April 1, 2025

NLG: ఆన్‌లైన్‌లో పేరు ఉన్నా.. సన్న బియ్యం!

image

కొత్తగా రేషన్ కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూతనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేరకు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

News April 1, 2025

NLG: మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

image

యువత స్వయం ఉపాధిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం పథకానికి శ్రీకారం కొట్టిన విషయం తెలిసిందే. తొలుత దరఖాస్తులకు ఏప్రిల్ 5 వరకు అవకాశం కల్పించింది. అయితే సర్వర్ సమస్యలు, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో వాటి జారీకి సమయం పడుతోంది. దీంతో దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించింది. జిల్లాలో ఇప్పటివరకు 22,356 మంది దరఖాస్తు చేసుకున్నారు.

News April 1, 2025

NLG: ఎల్ఆర్ఎస్‌కు స్పందన అంతంత మాత్రమే!

image

ఉమ్మడి జిల్లాలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీంకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ఎల్ఆర్ఎస్ కింద మార్చి 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే వారికి ప్రభుత్వం 25% రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్చి 29 వరకు 1418 ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఒక్క సోమవారం మాత్రం 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.

error: Content is protected !!