News March 4, 2025

నల్గొండ: శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. పీఆర్టియూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డితో పోటీపడి 13,969 ఓట్లు సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఆసాంతం ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. చివరకు మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్‌తోనే శ్రీపాల్ రెడ్డి గెలుపు ఖరారైంది.

Similar News

News March 4, 2025

NLG: ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లు

image

ఇంటర్ విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావొచ్చని జిల్లా ఇంటర్ విద్యా అధికారి దస్రునాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో తీసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకుండానే పరీక్షలు రాయవచ్చని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ల మంజూరులో జాప్యం చేసినా, కేంద్రాల్లో సమస్యలు ఉన్నా డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News March 4, 2025

NLG: హాస్టల్ పిల్లలకు నో చికెన్!

image

బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో సాధ్యమైనంతవరకు విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని జిల్లా పరిధిలోని ఆయా హాస్టళ్ల వార్డెన్లకు పరోక్ష ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. దీంతో కొన్ని హాస్టళ్లలో విద్యార్థులకు చికెన్ పెట్టడం మానేశారు. కొన్ని హాస్టళ్లలో మాత్రం వార్డెన్లు చికెన్ వండి పెడుతున్నారని పలు హాస్టళ్ల సంక్షేమాధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై అధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు.

News March 4, 2025

చందంపేట: కారు ఢీకొని వ్యక్తి మృతి

image

కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చందంపేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం.. మానవత్ తండాకు చెందిన రమావత్ పాండు, ఆయన ఇద్దరు భార్యలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా బిల్డింగ్ తండా సమీపంలో ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాండు మృతి చెందగా.. భార్యలు కౌసల్య, చాందిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!