News March 28, 2025

నల్గొండ: సన్న బియ్యానికి రూ.857.76 కోట్ల ఖర్చు

image

ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో అందుకోసం ప్రభుత్వం రూ.857.76 కోట్లను ఖర్చు పెట్టనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా కొత్త కార్డుదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. అయితే నల్గొండ జిల్లాలో 4,66,522.. సూర్యాపేట జిల్లాలో 3,05, 564.. యాదాద్రి జిల్లాలో 2,17,072 రేషన్ కార్డులున్నాయి.

Similar News

News November 18, 2025

నల్గొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలి

image

నషాముక్త భారత్‌ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చే దిశగా ప్రతి విద్యా సంస్థ కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని అందరూ ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు.

News November 18, 2025

నల్గొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలి

image

నషాముక్త భారత్‌ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చే దిశగా ప్రతి విద్యా సంస్థ కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని అందరూ ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు.

News November 18, 2025

NLG: ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం తింటారు!

image

2026 జనగణన నేపథ్యంలో తిప్పర్తి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన సర్వే చేస్తున్నారు. ఇంటి యజమాని పేరు, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? రైస్ తింటారా లేదంటే గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలు తింటారా? ఉండేది పెంకుటిల్లా? వంటి వివరాలు అడిగి వెంట వెంటనే యాప్‌లో నమోదు చేస్తున్నారు.