News March 28, 2025
నల్గొండ: సన్న బియ్యానికి రూ.857.76 కోట్ల ఖర్చు

ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో అందుకోసం ప్రభుత్వం రూ.857.76 కోట్లను ఖర్చు పెట్టనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా కొత్త కార్డుదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. అయితే నల్గొండ జిల్లాలో 4,66,522.. సూర్యాపేట జిల్లాలో 3,05, 564.. యాదాద్రి జిల్లాలో 2,17,072 రేషన్ కార్డులున్నాయి.
Similar News
News December 23, 2025
దరఖాస్తుల పెండింగ్పై నల్గొండ కలెక్టర్ సీరియస్

విద్యార్థుల ఉపకార వేతనాలకు ఆటంకం కలగకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలను తక్షణమే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కనగల్ మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆమె ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించారు. సర్టిఫికేట్ల జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
News December 23, 2025
NLG: అమ్మో ర్యాగింగ్ భూతం..!

కోటి ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించడానికి కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులను ర్యాగింగ్ భూతం భయపెడుతుంది. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానిక మెడికల్ కళాశాలలో ప్రారంభమైన ఈ విష సంస్కృతి క్రమంగా డిగ్రీ కళాశాలల్లోకి ప్రవేశించింది. తాజాగా స్థానిక గురుకుల కళాశాలలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని 4 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
News December 23, 2025
NLG: 2025@విషాదాల సంవత్సరం

2025లో NLG జిల్లాలో పలు భారీ రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. HYD-సాగర్, HYD- VJD, NKP- అద్దంకి హైవేలపై భారీ ప్రమాదాలు జగిరాయి. ఈ ప్రమాదాలలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. 2025లో రాచకొండ పరిధిలో (NLGలో కొంత భాగం ) మొత్తం 3,488 రోడ్డు ప్రమాదాలు జరగగా.. అందులో 650 మంది మరణించినట్లు సమాచారం.


