News March 29, 2024

నల్గొండ: సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకోవాలని..

image

నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు స్థానాలను గత ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉత్తమ్ నల్గొండ నుంచి , కోమటిరెడ్డి భువనగిరి నుంచి ఎంపీలుగా గెలిచారు. ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ గెలుపుకోసం ఆరాటపడుతున్నాయి.

Similar News

News December 3, 2025

నల్గొండ: గ్రామ పంచాయతీలకు ఊరట..!

image

నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని బకాయిలు వసూళ్లు కావడంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు ఇంటి పన్ను, నల్లా బకాయిలు చెల్లించి నామినేషన్ ఫారంకు రశీదు జతచేయాలని నిబంధన ఉండడం పంచాయతీలకు వరంగా మారింది. బకాయి బిల్లులు వసూలు కావడంతో పంచాయతీలకు కొంత ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

News December 3, 2025

నల్గొండ: నేడు ఉపసంహరణకు ఆఖరు!

image

మొదటి విడత ఎన్నికలు జరిగే నల్గొండ, చండూరు డివిజన్‌లోని 14 మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణలపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన అభ్యర్థి మినహా మిగతా వారితో నామినేషన్ విత్ డ్రా చేయించేలా నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా వెల్లడి కానుంది.

News December 3, 2025

ఆ వివరాలు ఇవ్వకుంటే.. ఇదే జరుగుద్ది: నల్గొండ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా లెక్కలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను ఎన్నికల అధికారులకు అందించాలన్నారు. లేదంటే గెలిచిన వారు పదవులు కోల్పోతారన్నారు. మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారని, ఓడిన వారు కూడా ఇవ్వాల్సిందేనని తెలిపారు.