News March 13, 2025
నల్గొండ: 15 నుంచి ఒంటిపూట బడులు..!

నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు ఈనెల 15 నుంచి ఒక పూట బడులు నిర్వహిస్తామని జిల్లా డీఈవో భిక్షపతి అన్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 12:30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని, పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఒంటిగంట నుంచి ఐదు గంటల వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 23వరకు ఒంటిపూట బడులు జరగనున్నాయి. SHARE IT.
Similar News
News April 15, 2026
ఎండిపోతున్న కృష్ణమ్మ: డెడ్ స్టోరేజీకి నాగార్జునసాగర్

తెలుగు రాష్ట్రాల వరప్రదాయని నాగార్జునసాగర్ జలాశయం నీటి కొరతతో వెలవెలబోతోంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో సాగు, తాగునీటి సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కృష్ణా బేసిన్ అంతటా నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
News April 15, 2026
నాగార్జునసాగర్ మీదుగా 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్టు వరకు నాగార్జునసాగర్ నియోజకవర్గం మీదుగా 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవేకు ప్రాథమిక అలైన్మెంట్ సిద్ధమైంది. ఈ మార్గం 2 రాష్ట్రాలు, 5 జిల్లాలు, 100 గ్రామాల మీదుగా 297 కి.మీ. పొడవున సాగుతుంది. తెలంగాణలో 40, ఏపీలో 60 గ్రామాలు పరిధిలోకి వస్తాయి. డీపీఆర్ కోసం కన్సల్టెంట్ల ఎంపిక జరుగుతుండగా, డిసెంబరు నాటికి పూర్తి అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశ ఉందని అధికారుల అంచనా.
News April 15, 2026
నాగార్జునసాగర్ మీదుగా 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్టు వరకు నాగార్జునసాగర్ నియోజకవర్గం మీదుగా 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవేకు ప్రాథమిక అలైన్మెంట్ సిద్ధమైంది. ఈ మార్గం 2 రాష్ట్రాలు, 5 జిల్లాలు, 100 గ్రామాల మీదుగా 297 కి.మీ. పొడవున సాగుతుంది. తెలంగాణలో 40, ఏపీలో 60 గ్రామాలు పరిధిలోకి వస్తాయి. డీపీఆర్ కోసం కన్సల్టెంట్ల ఎంపిక జరుగుతుండగా, డిసెంబరు నాటికి పూర్తి అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశ ఉందని అధికారుల అంచనా.


