News March 26, 2025
నల్గొండ: 3 జిల్లాలకు 3 మంత్రి పదవులు..!

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్, బీసీ వర్గం నుంచి బీర్ల ఐలయ్య ఉన్నారు. అయితే సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ్, నల్గొండ నుంచి కోమటిరెడ్డి మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఐలయ్యను క్యాబినెట్లోకి తీసుకుంటే భువనగిరి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం దక్కినట్లు అవుతుంది. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరు కూడా అమాత్య పదవి రేసులో ఉన్నట్లు చర్చ సాగుతుంది.
Similar News
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. పాలమూరులో ఉత్కంఠ

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లాలోని వెల్దండ, తిమ్మనోనిపల్లిలో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను కోర్టు నేడు విచారించనుంది.
News November 27, 2025
అమరావతిలో రూ.1,328 కోట్ల పెట్టుబడులు.. 6,541 ఉద్యోగాలు

ఈ నెల 28న అమరావతిలోని సీఆర్డిఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయ పనులకు శంకుస్థాపన జరగనుంది. 15 బ్యాంకుల ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,541 ఉద్యోగాల కల్పన అమరావతిలో జరగనుందని CRDA కమిషనర్ కె. కన్నబాబు IAS బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాబార్డ్, ఆప్కాబ్, ఎల్ఐసీ, NIACLతో పాటు 11 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెంలో ఏర్పాటు కానున్నాయన్నారు.
News November 27, 2025
మంచిర్యాల: 90 సర్పంచ్, 816 వార్డు స్థానాలకు నామినేషన్

మంచిర్యాల జిల్లాలోని తొలి విడతలో 4 మండలాల్లో 90 సర్పంచ్, 816వార్డుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దండేపల్లి (M)లో 31 GPలు, 278 వార్డులు, హాజీపూర్ (M)లో 12 GPలు,106 వార్డులు, జన్నారం (M)లో 29 GPలు, 272 వార్డులు, లక్షెట్టిపేట (M)లో 18 GPలు,160 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు.


