News March 3, 2025

నల్గొండ: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494

Similar News

News December 12, 2025

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: KTR

image

TG: పంచాయతీ ఎన్నికల్లో సగం స్థానాలు కూడా గెలవకపోవడం, అనేకచోట్ల 10, 20 ఓట్లతో బయటపడటం చూస్తుంటే కాంగ్రెస్ కౌంట్‌డౌన్ పల్లెల నుంచే మొదలైనట్లు అర్థమవుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. వచ్చే మూడేళ్లు ఆ పార్టీ అధికారంలో ఉన్నా పైసా అభివృద్ధి జరగదని ప్రజలు డిసైడ్ కావడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో INC పాతాళానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

News December 12, 2025

ఆసుపత్రుల పారిశుద్ధ్యంపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఏ.సిరి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, శుభ్రత సేవల పర్యవేక్షణపై ఆమె ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పారిశుద్ధ్య ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 12, 2025

గుంతకల్లులో నంచర్ల యువకుడి దారుణ హత్య

image

చిప్పగిరి(M) నంచర్లకు చెందిన యువకుడు చంద్రశేఖర్ అనంత(D) గుంతకల్లులో దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన గుంతకల్లులోని ఆదర్శ నగర్‌లో ఉంటున్నాడు. శుక్రవారం కుళాయి వద్ద నీటి కోసం చంద్రశేఖర్, పక్కింటి శివకు మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ను శివ కొడవలితో నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.