News March 3, 2025
నల్గొండ: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494
Similar News
News October 22, 2025
విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.
News October 22, 2025
గోదావరిఖని వన్టౌన్లో మెగా రక్తదాన శిబిరం

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ అంబర్ కిషోర్ హాజరై డీసీపీ పీ.కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు, యువత రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని తల సేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నట్లు తెలిపారు.
News October 22, 2025
ఇరాక్లో గుండె పోటుతో పెగడపల్లి వాసి మృతి

పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మని రమేశ్ (55) ఇరాక్లో గుండె పోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం ఇరాక్ దేశానికి వెళ్లిన రమేశ్, బుధవారం ఇంటికి వచ్చేందుకు గాను మంగళవారమే విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం రమేశ్ గుండె పోటుకు గురయ్యాడు. స్థానికులు హాస్పిటల్కు తరలించగా మృతి చెందాడు.