News August 20, 2024
నల్లగొండ: రికార్డు సృష్టించిన ఆర్టీసీ

రక్షా బంధన్ సందర్భంగా RTC నల్లగొండ రీజియన్లో 128 ఆక్యుపెన్సీ రేషియో, 76.26 ఎర్నింగ్ పర్ కిలోమీటర్తో 3,78,982 మంది ప్రయాణించారని ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ M. రాజశేఖర్ మంగళవారం తెలిపారు. ఇందులో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని, దీని ద్వారా రికార్డు స్థాయిలో రూ. 2,23,20,254 రాబడి వచ్చిందన్నారు. ఆ చరిత్రలో ఇది అల్ టైం రికార్డ్ అని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించామన్నారు.
Similar News
News November 5, 2025
NLG: 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ: కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలంలో ఇప్పటి వరకు 72,475 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామని, అందులో 46,568 మెట్రిక్ టన్నుల ధాన్యం ఓపీఎంఎస్లో ఎంట్రీ చేసి.. 5,657 మంది రైతులకు రూ.102 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
News November 4, 2025
NLG: పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

వివిధ ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన చాంబర్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోత పథకాల కింద భూసేకరణ, పునరావస పనులపై సమీక్ష నిర్వహించారు.
News November 4, 2025
నల్గొండ: ‘గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరించాలి’

రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆహార భద్రత కార్డులను మంజూరు చేస్తున్న సందర్భంగా గృహజ్యోతి పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని నూతన లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ కార్డ్ లేకపోవడం వల్లే గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో తమ దరఖాస్తులు అధికారులు స్వీకరించలేదని వారు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు 60 వేల మంది నూతన కార్డుదారులు ఉన్నారు.


