News January 26, 2025

నల్లగొండ: MGU మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

Similar News

News November 14, 2025

పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ ముందంజ

image

TG: జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్‌లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్‌పేట డివిజన్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు.

News November 14, 2025

GNT: హాస్టల్ విద్యార్థిని బ్యాగ్‌లో మంగళసూత్రం.?

image

హాస్టల్ విద్యార్థిని బ్యాగ్‌లో గర్భనిర్ధారణ పరిక్ష పరికరం, మంగళసూత్రం వెలుగుచూడటం గుంటూరులో చర్చనీయాంశమైంది. నగరంపాలెం పరివర్తన భవన్ ఎస్సీ బాలికల వసతిగృహం సిబ్బంది విద్యార్థినుల బ్యాగులు తనిఖీ చేసే క్రమంలో ఆ వస్తువులు బయటపడ్డాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.? కలెక్టర్ తమీమ్ అన్సారియా గత రాత్రి హాస్టల్ ఆకస్మిక తనిఖీ కూడా ఇందుకు కారణమేనని తెలస్తోంది.

News November 14, 2025

రాబోయే పండుగలకు భద్రత చాలా ముఖ్యం: కలెక్టర్

image

రాబోయే పండుగల సమయంలో దేవాలయాలు, ప్రజా ప్రదేశాలలో పూర్తి భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గురువారం అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి పెట్రోల్ బంక్‌లు, థియేటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రజా భద్రతను నిర్ధారించడానికి లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆయన అధికారులకు సూచించారు.