News January 26, 2025
నల్లగొండ: MGU మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News February 11, 2025
పెద్దపల్లి: అతి తక్కువ ధరకు మట్టి, మొరం: కలెక్టర్

జిల్లాలో ప్రజలకు సొంత అవసరాల కోసం అవసరమైన మట్టి, మొరం తీసుకునేందుకు తహశీల్దారుల ద్వారా అతి తక్కువ ధరకు అనుమతి మంజూరు అవుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మట్టి, మోరం సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక ట్రాక్టర్కు రూ.200, టిప్పర్కు రూ.800 రుసుము తహశీల్దార్లకు చెల్లించి అనుమతి పొందాలన్నారు.
News February 11, 2025
అమరావతికి రూ.11వేల కోట్ల రుణం.. హడ్కో గ్రీన్ సిగ్నల్

AP: రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తుండగా, హడ్కో ఇచ్చే అప్పు విషయంలోనూ ముందడుగు పడింది. రూ.11వేల కోట్ల రుణంపై ముంబైలో జరిగిన పాలకమండలి భేటీలో అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత పత్రాలను సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు అందించారు. నాలుగు నెలల్లో లోన్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
News February 11, 2025
MBNR: జీరో(0) బిల్లు.. ఉమ్మడి జిల్లాలో ఎంతమందంటే!

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పటివరకు మహబూబ్ నగర్-1,29,451, నాగర్ కర్నూల్-1,06,525, నారాయణపేట-77,092, గద్వాల్-84,114, వనపర్తి-80,418 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరూ నెలకు 200 యూనిట్లలోపు(జీరో బిల్) విద్యుత్ వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు.