News January 26, 2025
నల్లగొండ: MGU మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News February 16, 2025
NRML: రాష్ట్రాలు దాటొచ్చిన ఎడారి ఓడ

రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఓ కుటుంబం తమ బతుకుదెరువు కోసం ఒంటెలను తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా నుంచి బాసరకు నాలుగు ఒంటెలను తీసుకొని వచ్చారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు కొంతమంది ఒంటెలను చూసి ఎంత బాగున్నాయంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ నుంచి వస్తున్నారని వారిని కొందరు పలకరించగా రాజస్థాన్ నుంచి పొట్టకూటి కోసం, ఒంటెల మేత కోసం ఇక్కడికి వచ్చినట్లు ఒంటెల కాపర్లు తెలిపారు.
News February 16, 2025
మహిళా నిర్మాతపై విచారణకు కోర్టు ఆదేశాలు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్పై ముంబైలోని ఓ కోర్టు విచారణకు ఆదేశించింది. ఆమె నిర్మించిన ఓ వెబ్ సిరీస్లో భారత జవాన్లను అవమానపరిచేలా సన్నివేశాలున్నాయని వికాస్ పాఠక్ అనే యూట్యూబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి యూనిఫామ్లో ఓ నటుడితో అభ్యంతరకర సన్నివేశాలు చేయించారని అందులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేటు కోర్టు, ఏక్తాపై విచారణ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించింది.
News February 16, 2025
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది: PM మోదీ

ఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘సన్నిహితుల్ని కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని తెలిపారు.