News October 2, 2024

నల్లజర్ల: జీవో ఇచ్చి మరీ మోసం చేశారు: ప్రసాద్

image

రాజమండ్రి ఎంపీ పురందీశ్వరితో పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం నల్లజర్లలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తమ వేతనాల విషయంలో జీవో ఇచ్చి మరీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కుటుంబ పోషణ భారంగా ఉందన్నారు. న్యాయం చేయాలని ఎంపీకి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

Similar News

News October 2, 2024

జాతీయస్థాయి పోటీలకు కొయ్యలగూడెం విద్యార్థి

image

కొయ్యలగూడెం వీఎస్ఎన్ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి వై.రాహుల్ పల్నాడు జిల్లాలో జరిగిన స్టేట్ లెవెల్ క్రీడల్లో పాల్గొని, జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని కళాశాల కరెస్పాండెంట్ స్వామి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి రాహుల్‌ను అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు.

News October 2, 2024

భీమవరంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

image

భీమవరం మండలం కొవ్వాడపుంతలో వ్యభిచార గృహంపై దాడి చేసినట్లు సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో మహిళను అదుపులోకి తీసుకుని ఆమెను విజయవాడ ఉజ్వల గృహానికి తరలించామన్నారు. అలాగే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న భార్యాభర్తలను కోర్టులో హాజరు పరిచి అనంతరం తణుకు సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

News October 2, 2024

ద్వారకాతిరుమలలో నేడు ఎంపీ పురందీశ్వరి పర్యటన

image

రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం (నేడు) ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయవర్గ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే మండల పరిషత్ అభివృద్ధిపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని అన్నారు.