News March 21, 2025

నల్లమడ: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

నల్లమడ మండలంలోని ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తికి పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష పడినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. 2019 మార్చి 22వ తేదీ కదిరి పోలీస్ స్టేషన్‌లో చిరంజీవిపై పోక్సో కేసు నమోదు అయిందన్నారు. అనంతపురం జిల్లా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిపై విచారణ జరిపి 20 ఏళ్ల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధించడం జరిగిందన్నారు.

Similar News

News March 24, 2025

ఫారంపాండ్ కుంటలకు కేరాఫ్ ఆలూరు

image

జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఫారంపాండ్ నీటి కుంటలకు కేరాఫ్ ఆలూరు. 2014 ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం హయాంలో మండలంలోని పెద్దహోతూరు గ్రామం వద్ద పైలెట్ ప్రాజెక్టుగా వీటిని తవ్వించారు. వాటి ఉపయోగం గురించి అప్పట్లో రైతులకు అవగాహన సైతం కల్పించారు. ఈ ప్రాంతంలో నీటి కుంటలు విజయవంతమవడంతో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కుంటల తవ్వకాలు చేపట్టారు. ఇక్కడి ఉపాధి సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీటిపై ట్రైనింగ్ ఇచ్చారు.

News March 24, 2025

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: DGP

image

AP: బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు DGP హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. IPL బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.

News March 24, 2025

యాదాద్రి: రూ.20 లక్షల స్కాలర్ షిప్

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి ఇన్‌ఛార్జి అధికారి వసంత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందుతుందన్నారు.

error: Content is protected !!