News February 22, 2025

నల్లమల అడవుల్లో దారి తప్పిన భక్తులు

image

తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్‌కు చెందిన కొందరు శివస్వాములు పాదయాత్రతో శ్రీశైలం వస్తూ నల్లమల అటవీ ప్రాంతంలో దారి తప్పారు. మనోజ్, గురుప్రసాద్, రాజు, గోపాల్, మరో ముగ్గురు ఆత్మకూరు పరిధిలోని ఇందిరేశ్వరం గ్రామం నుంచి గూగుల్ మ్యాప్ ద్వారా అడవి ప్రాంతంలోకి ప్రవేశించి, దారి తప్పారు. పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం జీపీఎస్ ఆధారంగా వారుండే ప్రాంతానికి చేరుకుని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Similar News

News November 27, 2025

మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్

image

పది రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్ చేస్తోంది. మనీ లాండరింగ్ కేసులో AP, TG, MH, MP, UP, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్‌లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. గతంలో అధికారులకు లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీల్లో జరిగిన తనిఖీలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయా యాజమాన్యాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఈ ఏడాది జూన్‌లో FIR నమోదైంది.

News November 27, 2025

డబ్బులిస్తే జాబ్ వస్తుందా?.. ఇకనైనా మారండి!

image

HYDలో ఓ నకిలీ IT కంపెనీ ఉద్యోగాల పేరిట 400 మంది నిరుద్యోగులను మోసగించింది. జాబ్ గ్యారెంటీ పేరుతో రూ.3లక్షల చొప్పున వసూలు చేసింది. ఇలా మోసపోవద్దంటే.. తప్పుదోవలో ఉద్యోగం కోసం వెతక్కుండా స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. ఏ కంపెనీ కూడా డబ్బు తీసుకొని జాబ్ ఇవ్వదు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు నేర్చుకుంటే, మీ అర్హత, స్కిల్స్ ఆధారంగా ఉద్యోగం సాధించవచ్చు. నైపుణ్యం ఉంటే ఉద్యోగం మీదే.

News November 27, 2025

నెయ్యి కల్తీకి ఆధారాలు లేవు: YV సుబ్బారెడ్డి

image

తిరుమల శ్రీవారి ఆలయాన్ని కొన్నాళ్లుగా రాజకీయాల్లోకి లాగుతున్నారని TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి అన్నారు. ‘లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నెయ్యి కల్తీ జరిగిందని ఎలాంటి ల్యాబొరేటరీ ఆధారాలు లేవు. సిట్ విచారణతో ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది TTD ప్రతిష్ఠ, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. యానిమల్ ఫ్యాట్ ఉందన్న నెయ్యిని వాడారన్న CBN ఆరోపణలకు సమాధానం లేదు’ అని YV పేర్కొన్నారు.