News July 30, 2024

నల్లమల ఫారెస్ట్‌లో 87కు చేరిన పెద్ద పులుల సంఖ్య

image

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య 87కి చేరిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశంలోనే అతి పెద్దదైన శ్రీశైలం- నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్ట్‌లో 2014 సంవత్సరంలో పెద్ద పులుల సంఖ్య 48గా ఉండగా.. 2022కు ఆ సంఖ్య 62కు చేరిందన్నారు. ప్రస్తుతం ఆ పెద్ద పులుల సంఖ్య 87. అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకై 800 మంది చెంచు గిరిజనులు పనిచేస్తున్నారని DFO విఘ్నేశ్ అప్పావ్ తెలిపారు.

Similar News

News December 10, 2025

ప్రకాశం వాసులకు CM గుడ్ న్యూస్.!

image

ప్రకాశం జిల్లాకు సంబంధించి CM కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలు సాగుచేసే రైతన్నలకు శుభవార్తగా చెప్పవచ్చు. ఉద్యానపంటలపై సమీక్షించిన సీఎం, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులను పూర్తి చేయడం ద్వారా పంటలకు నీరు అందించవచ్చని అధికారులకు సూచించారు. పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొత్తగా 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు.

News December 10, 2025

చీమకుర్తిలో పిల్లలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

చీమకుర్తిలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ రాజాబాబు, MLA విజయ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు శివాజీ, ఎల్వీ నరసింహారావు, మండల టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

News December 10, 2025

ప్రకాశం జిల్లాలో 2కు చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

image

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది. వారం రోజుల వ్యవధిలో స్క్రబ్ టైఫస్‌తో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గతంలో ఇదే వ్యాధి లక్షణాలతో ఎర్రగొండపాలెం మండలంలో ఓ మహిళ మృతి చెందగా.. తాజాగా సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన మహిళ మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. అయితే స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అవసరం లేదని.. అవగాహన అవసరమని అధికారులు సూచిస్తున్నారు.