News January 29, 2025
నవాబుపేట: నలుగురు కొట్టి చంపారు

ఓ వ్యక్తిని నలుగురు కొట్టి చంపిన ఘనట నవాబుపేట (M) మరికల్లో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె సోదరులు గొడవలు పెట్టుకున్నారు. అతడి బైక్కి నిప్పంటించారు. మంగళవారం పొలంలో ఒంటరిగా ఉన్న నర్సింహులుపై నలుగురు దాడి చేశారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదైంది.
Similar News
News November 23, 2025
VZM: ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలం : బొప్పరాజు

ఉద్యోగ సంఘాలు ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని APJAC రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ హోమ్లో జిల్లా APJAC పరిధిలోని సభ్య సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పిన ఆయన.. పెండింగ్లో ఉన్న బకాయిల సాధనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. APJAC సాధించిన విజయాలను కూడా సమావేశంలో వివరించారు.
News November 23, 2025
న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్ వద్ద రిపోర్టర్ ధర్నా

కుందుర్పికి చెందిన ఓ దినపత్రిక రిపోర్టర్ తిమ్మప్ప తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులతో కలిసి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం జీడిపల్లికి చెందిన గంగాధర్, ఆదినారాయణ తనపై <<18354872>>దాడి<<>> చేశారన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు ఇంతవరకూ దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయలేదన వాపోయారు. కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News November 23, 2025
న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్ వద్ద రిపోర్టర్ ధర్నా

కుందుర్పికి చెందిన ఓ దినపత్రిక రిపోర్టర్ తిమ్మప్ప తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులతో కలిసి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం జీడిపల్లికి చెందిన గంగాధర్, ఆదినారాయణ తనపై <<18354872>>దాడి<<>> చేశారన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు ఇంతవరకూ దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయలేదన వాపోయారు. కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


