News February 3, 2025
నవాబ్పేట్: రైతు దీక్ష విజయవంతం చేయాలి: దయాకర్ రెడ్డి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసానికి వ్యతిరేకంగా, రైతుల పక్షాన 5న నవాబ్పేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దయాకర్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నేతలు పాల్గొంటారన్నారు.
Similar News
News February 10, 2026
ఖమ్మం: తెలంగాణ పోరాట యోధురాలు మృతి

తెలంగాణ పోరాట యోధురాలు గండూరి నర్సు బాయమ్మ మరణించారు. ఖమ్మం పరిధి మామిండ్ల గూడెంలో నివాసం ఉంటున్న ఆమె అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆమె భర్త, సీపీఎం నేత గండ్లూరి కిషన్రావు 1976లో మామిండ్లగూడెంలోని తన ఇంటి సమీపంలోనే హత్యకు గురయ్యారు. ఆమె గతంలో ముదిగొండ మండలం బాణాపురం సర్పంచ్గా పని చేశారు. నర్సు బాయమ్మ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
News February 10, 2026
అనకాపల్లి టీడీపీలో ముదురుతున్న పెట్రోల్ బంక్ రాజకీయం

అనకాపల్లిలో డీసీఎంఎస్ స్థలంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ టీడీపీలో రాజకీయ దుమారం రేపుతోంది. డీసీఎంఎస్ ఛైర్మన్గా టీడీపీకి చెందిన కోట్ని బాలాజీ బాధ్యతలు తీసుకున్న తరువాత పెట్రోల్ బంక్ పనులు జరుగుతున్న సమయంలో గత శనివారం మాజీ మంత్రి డీవీఆర్ తనయుడు రత్నాకర్ హైరానా చేసినట్లు సమాచారం. దీంతో ఈ సమస్యను పార్టీలోని ఇరువర్గాలు మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లినట్లు పార్టీ పెద్దలు పేర్కొన్నారు.
News February 10, 2026
టీనేజ్ ప్రెగ్నెన్సీలో ‘రెడ్ జోన్’లో అనంతపురం

అనంతపురం జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ శాతం 12కుపైగా నమోదు కావడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విషయంలో జిల్లా రెడ్ జోన్లో ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. గత ఏడాది జిల్లాలో 1,500 మందికి పైగా టీనేజర్లు గర్భం దాల్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై అవగాహన పెంచి, బాల్య వివాహాలను అరికట్టాలని సీఎం ఆదేశించారు.


