News January 22, 2025
నవీపేటలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ఐదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను ఇద్దరు మైనర్లు (12), (13) శనివారం ఆడుకుందామని పిలిచి లైంగిక దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు.
Similar News
News February 25, 2026
కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోండి: MP

రాష్ట్రంలో కల్తీ పాల అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తిరుపతి MP గురుమూర్తి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. అంగన్వాడీలు, డెయిరీలు, హోటళ్లు, స్వీట్లు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించాలని ఆదేశించారు. కల్తీ నిర్ధారణైతే చర్యలు తీసుకోవాలని, పునరావృతమైతే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News February 25, 2026
కలెక్టర్ చేతులమీదుగా అక్రిడేషన్ విడుదల

2026 సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టు అక్రిడేషన్ కార్డులను కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం పంపిణీ చేశారు. పలువురు జర్నలిస్టులు కలెక్టర్ నుంచి అక్రిడేషన్ కార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
News February 25, 2026
NZB: హిందువులపై దాడి చేసిన వారిని శిక్షించాలి: దినేష్ కులాచారి

రుద్రూర్, బాన్సువాడ, నిజామాబాద్లలో హిందువులపై దాడులు చేస్తున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరుగుతున్నాయని, పక్షపాత ధోరణి వీడి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.


