News January 23, 2025
నవీపేటలో బోల్తా పడిన స్కూల్ బస్సు

మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. నవీపేటకు చెందిన స్కూల్ బస్సు గురువారం ఉదయం పిల్లలను నాడాపూర్లో ఎక్కించుకొని వెళుతుండగా కమలాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కాగా బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News November 25, 2025
NZB: మూడు విడతల్లో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 545 GPలు, 5,022 వార్డులకు ఎన్నికలు జరగనుండగా మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 GPలు, 1,642 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో NZB డివిజన్లోని 196 GPలు, 1,760 వార్డులకు, మూడో విడతలో ఆర్మూర్ డివిజన్లోని 12 మండలాల్లో 165 GPలు, 1,620 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
News November 25, 2025
నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?

నిజామాబాద్ జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
మొదటి విడత: చందూర్, మోస్రా, రుద్రూర్, వర్ని, కోటగిరి, పోతంగల్, బోధన్, రెంజల్, నవీపేట్, సాలూర మండలాలలో..
రెండో విడత: ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, NZB రూరల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల్లో..
మూడో విడత: ఆర్మూర్, బాల్కొండ, కమ్మర్పల్లి, భీమ్గల్, మోర్తాడ్, మెండోరా, నందిపేట్ మండలాల్లో జరగనున్నాయి.
News November 25, 2025
26న BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేయడానికి నిజామాబాద్లో ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఆయన గుర్తు చేశారు.


