News October 3, 2024

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

కూసుమంచి: పాలేరు నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి(2025-26) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 7వ తేదీ అన్నారు. 01-05-2013 నుండి 31-07-2015 జన్మించి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 18-01-2025 న ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో వరుసగా 3,4 తరగతులు ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

Similar News

News October 27, 2025

ఖమ్మం: పంట కోతలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

image

రాబోయే 2 రోజుల పాటు తుపాను ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంట కోతలు వాయిదా వేసుకోవాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 100% ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పంట నష్టం జరగకుండా టార్పాలిన్ కవర్లు సిద్ధం చేయాలని సూచించారు.

News October 27, 2025

ఖమ్మంలో పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు

image

ఖమ్మం జిల్లాలో 116 ఏ4 మద్యం షాపుల కేటాయింపును లాటరీ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తం 4,430 దరఖాస్తులు అందగా, దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా తీశారు. రిజర్వేషన్ ప్రకారం గౌడలకు 18, ఎస్సీలకు 14, ఎస్టీలకు 8 షాపులు కేటాయించారు. లాటరీ ప్రక్రియను పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News October 27, 2025

ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపిక, భూవివాదాలు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, తగు చర్యలు తీసుకోవాలని వారు జిల్లా అధికారులను ఆదేశించారు.