News September 24, 2024

నవోదయ పాఠశాల ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

image

నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు తేదీని అక్టోబర్ 7 తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. సెప్టెంబర్ 23తో గడువు ముగియనుండగా దాన్ని అక్టోబర్ 7 వరకు పెంచారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. https://navodaya.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Similar News

News February 24, 2026

NZB: ఈనెల 25న జాబ్ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బి.ఫార్మా, డి.ఫార్మా, ఎం.ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.

News February 24, 2026

NZB: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి

image

రేపటి నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక 8 సిట్టింగ్ స్క్వాడ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక హెచ్పీసీ, ముగ్గురు డీఈసీ సభ్యులు పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

News February 24, 2026

నవీపేట: దూడను చంపిన చిరుత పులి

image

నవీపేట్ మండలంలోని అబ్బపూర్ (ఎం)లో ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి సంచారం భయాందోళన రేకెత్తించింది. బెల్లిడిగే అబ్బన్న అనే రైతు పశువుల పాకపై దాడి చేసిన చిరుత, ఒక దూడను చంపేసింది. సోమవారం ఉదయం యజమాని గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. బీట్ అధికారులు జాహుర్, సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అడుగుజాడలను సేకరించారు. వెటర్నరీ డాక్టర్ నరేందర్ రెడ్డి దూడకు పోస్టుమార్టం నిర్వహించారు.