News July 27, 2024
నవోదయ ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలన్నారు

చిత్తూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ దేవరాజు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25వ విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక పరీక్ష జనవరి 18న నిర్వహిస్తామన్నారు.
Similar News
News January 8, 2026
పుంగనూరు: 2042 వరకు అనుమతులు ఉన్నా.?

సదుంలో క్వారీపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్కు చెందిన ఐతేశ్వర్ణ్కు 2022 OCT 21న క్వారీకి అనుమతులు మంజూరయ్యాయి. సర్వే నంబర్ 270/2లోని సుమారు 4 హెక్టార్ల విస్తీర్ణంలో రంగు గ్రానైట్ రాళ్ల తవ్వకాలను ప్రారంభించారు. ఈ క్వారీకి 2042 OCT 20 వరకు అనుమతులు ఉన్నాయి. గ్రామస్థులు, క్వారీ యజమానులు మధ్య పంచాయితీ PS వరకు వెళ్లింది. గ్రామస్థులు కావాలనే అడ్డుకుంటున్నారనే వివాదం నడుస్తోంది.
News January 8, 2026
చిత్తూరు: వైసీపీలో పలువురికి పదవులు

జిల్లాకు చెందిన పలువురిని వైసీపీలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫక్రుద్దీన్(పుంగనూరు) మైనారిటీ సెల్ జోన్ 5 వర్కింగ్ ప్రెసిడెంట్, రవీంద్రనాథ్ రెడ్డి(చిత్తూరు) రాష్ట్ర లీగల్ జనరల్ సెక్రెటరీ, లీగల్ సెల్ అధికార ప్రతినిధులుగా రవీంద్ర(నగరి) సుగుణ శేఖర్ రెడ్డి(చిత్తూర్), జిల్లా ఉద్యోగులు, పింఛన్ వింగ్ అధ్యక్షుడిగా సోమచంద్రారెడ్డి(పలమనేరు)ను నియమించారు.
News January 7, 2026
క్రీడా పరికరాలు అందించిన చిత్తూరు కలెక్టర్

చిత్తూరు వికలాంగుల క్రీడా సంఘం సభ్యులు రాష్ట్రస్థాయి పోటీలలో పథకాలు సాధించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ను బుధవారం కలిశారు. మరిన్ని విజయాలు సాధించేందుకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు. వారి వినతి మేరకు.. షటిల్ బ్యాట్స్ 6, షూస్ 10 జతలు, జావెలిన్ 2, షాట్ పుట్ 2, షటిల్ కాక్ బాక్సులు రెండు వారికి కలెక్టర్ అందించారు. వారిని అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.


