News March 28, 2025

నవ భారత నిర్మాణం యువత ద్వారానే సాధ్యం: కరీముద్దీన్

image

నవ భారత నిర్మాణం యువత ద్వారానే సాధ్యమని అబ్దుల్ కలాం ఆజాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్‌కే కరీముద్దీన్ అన్నారు. సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నైతిక సామాజిక విలువలు పెంపొందించేందుకు ఎన్ఎస్ఎస్ దోహదపడుతుందని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Similar News

News November 21, 2025

Rh నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఏం చేయాలంటే?

image

తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ అయితే ప్రెగ్నెన్సీలో కచ్చితంగా ఇండైరెక్ట్‌ కూంబ్‌ టెస్ట్‌ (ICT) 3,7 నెలల్లో చేయించుకోవాలి. ఐసీటీ నెగెటివ్‌ వస్తే ఏడో నెలలో, డెలివరీ అయిన 72 గంటల్లో తల్లికి ‘యాంటీ డీ’ ఇంజెక్షన్‌ డోసులు ఇస్తారు. రెండోసారి గర్భం దాల్చిన వారిలోనే దీని సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు, డాప్లర్‌ స్కానింగ్‌ పరీక్షలు చేయించాలి. సమస్య తీవ్రతను బట్టి బిడ్డకు చికిత్స చేస్తారు.

News November 21, 2025

తులసికి సమర్పించకూడని నైవేద్యాలివే..

image

తులసి మొక్కపై లక్ష్మీ దేవి ఉంటారని నమ్ముతాం. అందుకే పూజలు చేస్తాం. అయితే ఈ దేవతకు కొన్ని నైవేద్యాలు సమర్పించడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. శివ పూజకు వాడిన బిల్వ పత్రాలు, పారిజాత పూలు తులసికి సమర్పించకూడదట. చెరుకు రసం కూడా నిషిద్దమేనట. పాలు కలిపిన నీరు, నల్ల విత్తనాలు కూడా వద్దని సూచిస్తున్నారు. గణపతి పూజకు ఉపయోగించిన ఏ వస్తువునూ తులసికి సమర్పించకూడదనే నియమం ఉందంటున్నారు.

News November 21, 2025

మాజీ మంత్రి శైలజానాథ్‌కు మాతృవియోగం

image

శింగనమల వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్‌లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.