News September 21, 2024

నష్టపరిహారం అందని వరద బాధితులకు ప్రత్యేక కౌంటర్లు: కమిషనర్

image

ఖమ్మం మున్నేరు వరద ముంపునకు గురై నష్ట పరిహారం అందని వరద బాధితుల వివరాల సేకరణ కోసం ప్రతి డివిజన్ నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ఈ ప్రత్యేక కౌంటర్లను రేపటి నుంచి అన్ని డివిజన్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కావున వరద బాధితులు ఈ విషయాన్ని గమనించి తమ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లను అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

PHCలలో అరకొర సేవలు.. ప్రజలకు రేబిస్ టీకా కష్టాలు

image

ఖమ్మం జిల్లాలోని 22 PHCలు,3 బస్తీ దవాఖానాల్లో వైద్యులు, మందుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రేబిస్ వ్యాక్సిన్ వంటి అత్యవసర మందులు లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. గర్భిణులకు టెక్నీషియన్, వసతులు లేక జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నారు. సేవలు లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.

News November 22, 2025

‘రాంగ్‌రూట్‌’ అత్యంత ప్రమాదకరం: సీపీ సునీల్ దత్

image

రాంగ్‌రూట్‌లో ప్రయాణం అత్యంత ప్రమాదకరమని, వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ హెచ్చరించారు. కొద్దిపాటి దూరం కోసం కూడా రాంగ్‌రూట్‌ను ఆశ్రయించవద్దన్నారు. ‘మీరు చేసే పొరపాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది’ అని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సరైన మార్గంలో ప్రయాణించి, క్షేమంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆయన వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

News November 22, 2025

బోనకల్‌లో నిలిచిన ఉచిత సౌర విద్యుత్ పనులు

image

మధిర నియోజకవర్గం బోనకల్ మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పటికీ, పనులు నిలిచిపోవడంతో లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంది. మండలంలోని 22 గ్రామాల్లో అధికారులు గతంలో 15 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించారు. అయితే, సర్వే పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇంటికీ సోలార్ పరికరాలు అమర్చలేదు. దీంతో ఈ పథకం ఎప్పుడు అమలవుతుందో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.