News September 10, 2024
నష్ట నివేదికను 11న అందజేయాలి: కలెక్టర్ దినకర్

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన వివరాలను 11వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవానం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీ రాజ్, డీపీవో,ఆర్డబ్ల్యుఎస్, డ్వామా, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలకు డేమేజ్ జరిగితే తక్షణమే మరమ్మతు పనులు చేయాలన్నారు.
Similar News
News December 23, 2025
శ్రీకాకుళం: ఆ రోడ్డుపై బారులు తీరిన టాక్టర్లు ఎందుకంటే?

నందిగం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం లోడులతో రైతులు అవస్థలు పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ధాన్యం బస్తాలతో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నందిగం మండలంలో 22 రైతు సేవా కేంద్రాల పరిధిలో ట్రక్ షీట్లు మంజూరు చేస్తుండగా 11 రైస్ మిల్లులో కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉండగా సోమవారం నాటికి కేవలం 2 మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
News December 23, 2025
శ్రీకాకుళం: ‘రూ.80 వేలు కడతావా.. అరెస్ట్ అవుతావా’

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ యువకుడు వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేసిన ఘటన పాతపట్నంలో చేటుచేసుకుంది. నరసింహానగర్-2లో నివాసముంటున్న వెంకట భీష్మ నేతజీకి ఓ నంబర్ నుంచి సెప్టెంబర్ 23న ఫోన్ చేసి మీరు డిజిటల్ ఆరెస్ట్ అయ్యారని రూ.80 వేలు చెల్లిస్తారా, అరెస్ట్ అవుతారా అని బెదిరించారు. అతడు బయపడి రూ.80వేలు చెల్లించాడు. మోసపోయానని తెలుసుకున్న అతడు సోమవారం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫిర్యాదు చేశాడు.
News December 23, 2025
సింహాచలం: ఆన్లైన్లో వైకుంఠ ఏకాదశి టికెట్లు

సింహాచలంలో డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు ఈవో సుజాత సోమవారం తెలిపారు. 100,300,500 రూపాయలు టికెట్స్ డిసెంబర్ 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనానికి టికెట్లు ఆన్లైన్లో మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. www.aptemples.org, 9552300009 మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. భక్తులు గమనించాలని సూచించారు.


