News September 10, 2024

నష్ట నివేదికను 11న అందజేయాలి: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన వివరాలను 11వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవానం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీ రాజ్, డీపీవో,ఆర్డబ్ల్యుఎస్, డ్వామా, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలకు డేమేజ్ జరిగితే తక్షణమే మరమ్మతు పనులు చేయాలన్నారు.

Similar News

News December 18, 2025

శ్రీకాకుళం: ట్రక్ షీట్ల జారీపై జేసీ సూచనలు

image

ధాన్యం కొనుగోలులో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ట్రక్ షీట్లపై శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం కీలక సూచనలు చేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 5 లోపు ట్రక్ షీట్లను జారీ చేయొద్దని సిబ్బందికి సూచించారు. మెలియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం RSK పరిధిలో బుధవారం వేకువజామున 3 గంటలకు 10 ట్రక్ షీట్లు ఇవ్వడంపై కోసమాల, నందిగం, సోంపేట PACS పరిధిలో నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించారు.

News December 18, 2025

SKLM: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..!

image

సంక్రాతి పండగకు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అధనంగా 16 ప్రత్యేక రైళ్లను నడవనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం శ్రీకాకుళంలో వెల్లడించారు. జనవరి 9 నుంచి 19 మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో ఇది వరకే ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్టు తెలిపారు.

News December 18, 2025

డా.బీఆర్‌. ఏయూను సందర్శించిన విద్యామండలి ఛైర్మన్

image

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.మధుమూర్తి బుధవారం ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీను సందర్శించారు. ఎన్టీఆర్ ప్రధాన పరిపాలన భవనంను, సైన్స్ కళాశాలలను పరిశీలించారు. నూతన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరాలు, ఇతర కార్యాలయాలు, వసతలు, సౌకర్యాలు చూసి ఈ భవనం రాజమందిరాన్ని తలపిస్తుందని ఈ సందర్శంగా ప్రశంసించారు. వీసి రజని ఆయన్ను సత్కరించారు.