News February 10, 2025

నసురుల్లాబాద్: ‘పంటలు ఎండి పోతున్నాయి’

image

నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో నిజాంసాగర్ కాలువ నీళ్లు అందక ఎండిపోతున్న వరి పంటను జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు ఎండిపోతున్న విషయం వాస్తవమేనని పంటలకు నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ADA అరుణ, AO భవాని, AEO గోపాల్, రైతులు పాల్గొన్నారు.

Similar News

News September 14, 2025

పల్నాడు జిల్లా ఐదో ఎస్పీగా కృష్ణారావు నియామకం

image

పల్నాడు జిల్లా ఐదో ఎస్పీగా కృష్ణారావు నియమితులయ్యారు. 2014 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన గతంలో విశాఖపట్నం రూరల్ ఎస్పీగా, గ్రేహౌండ్స్ ఓఎస్‌డీగా, ఏసీబీలో ఎస్పీగా పనిచేశారు. అలాగే, పులివెందుల ఎస్పీగా, అన్నమయ్య జిల్లా ఎస్పీగా కూడా ఈయన సేవలు అందించారు. కాగా పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటికే నలుగురు ఎస్పీలు బదిలీ అయ్యారు.

News September 14, 2025

HYD: ఓటరుగా నమోదు చేసుకోండి: కమిషనర్ RVK

image

జూలై 1, 20025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈనెల 17వ తేదీన ఓటరు నమోదుకు అవకాశం ఉందని, ఈ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in, ecinet.eci.gov.in, eci.gov.inలలో నమోదు చేసుకోవచ్చని సూచించారు.

News September 14, 2025

మినరల్ వాటర్ తాగిన వారికీ డయేరియా.. కారణం ఇదే!

image

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పరిధిలోని డయేరియా కేసుల వ్యాప్తి నేపథ్యంలో పలు RO ప్లాంట్లను అధికారులు పరిశీలించారు. నీటిలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాను తొలగించే UV LAMP అనేక చోట్ల లేదని గుర్తించారు. దీని విలువ రూ. 25 వేల వరకు ఉంటుందట. దీంతో అంత ఖర్చు మనకెందుకు అన్నట్లు RO ప్లాంట్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నీటిలో బ్యాక్టీరియా ప్రబలి డయేరియా బారిన పడ్డట్లు ప్రజలు అంటున్నారు.