News February 23, 2025

నస్తూర్ పల్లి అడవుల్లో పెద్దపులి సంచారం.. బస్సుల్లో ప్రయాణం!

image

కాటారం మండలంలోని నస్తూర్ పల్లి గ్రామ సమీప అడవుల్లో పెద్దపులి సంచరించిందనే వార్త వ్యాప్తి చెందింది. దీంతో మండలంలోని అటవీ సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. కాటారం నుంచి కాళేశ్వరం తదితర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు బైకులను పక్కనపెట్టి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. పులి మహాదేవపూర్ మండలంలోని బొమ్మపూర్ వైపు ప్రయాణించిందని చర్చ జోరుగా నడుస్తోంది. కాగా, దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Similar News

News October 21, 2025

అమరుల త్యాగమే శాంతికి పునాది: KMR కలెక్టర్

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగనిరతి వల్లే నేడు శాంతి, భద్రతలు నెలకొన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News October 21, 2025

జగిత్యాల: నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో SI వీరమరణం

image

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఎస్ఐగా పనిచేసిన క్రాంతి కిరణ్ తన సేవా కాలంలో ప్రజా భద్రత కోసం అహర్నిశలు కృషి చేశారు. విధి నిర్వహణలో ఎప్పుడూ ధైర్యంగా ముందుండే ఆయన, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచారు. తన విధుల్లో ఉన్న సమయంలో 1995 SEPT 29న రంగారావుపేటలో జరిగిన జనశక్తి నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో ఆయన అసువులు బాసారు. ఆయన ప్రాణత్యాగం ప్రజల మనసులో చెరగని ముద్ర వేసింది. SHARE IT.

News October 21, 2025

ఖమ్మంలో పోలీసు అమరవీరులకు ఘన నివాళి

image

శాంతి సమాజ స్థాపన కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. అమరవీరుల స్మారక స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొని వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.