News April 2, 2025
నస్పూర్: అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నస్పూర్ మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పంపిణీ చేస్తామన్నారు. అధికారుల సమన్వయంతో లబ్ధిదారులకు బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా సివిల్ సప్లై అధికారి బ్రహ్మారావు పాల్గొన్నారు.
Similar News
News April 19, 2026
‘జంబలకిడిపంబ’… బరాత్తో వధువు ఎంట్రీ ఆ తర్వాత..

పెళ్లి జరిగింది, అప్పగింతలు అవుతున్నాయి.. కట్ చేస్తే ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంది వధువు కాదు వరుడు! ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లాలోని సుపల్గా అనే గ్రామంలో ఈ సీన్ కనిపించింది. కొడుకులు లేకపోవడంతో కూతురిని వీడలేక వధువు తండ్రి సంబంధం టైమ్లోనే ఇల్లరికం ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. దీంతో అమ్మాయి ఊరేగింపుగా రావడం.. అబ్బాయిని పెళ్లాడి ఆమెతో పుట్టింటికి తీసుకుపోవడం జరిగాయి.
News April 19, 2026
‘జంబలకిడిపంబ’… బరాత్తో వధువు ఎంట్రీ ఆ తర్వాత..

పెళ్లి జరిగింది, అప్పగింతలు అవుతున్నాయి.. కట్ చేస్తే ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంది వధువు కాదు వరుడు! ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లాలోని సుపల్గా అనే గ్రామంలో ఈ సీన్ కనిపించింది. కొడుకులు లేకపోవడంతో కూతురిని వీడలేక వధువు తండ్రి సంబంధం టైమ్లోనే ఇల్లరికం ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. దీంతో అమ్మాయి ఊరేగింపుగా రావడం.. అబ్బాయిని పెళ్లాడి ఆమెతో పుట్టింటికి తీసుకుపోవడం జరిగాయి.
News April 19, 2026
జమ్మికుంట: జిల్లా పద్మశాలి మహిళా అధ్యక్షురాలిగా కందికట్ల పద్మ

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి చేనేత ఐక్య వేదిక కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం మహిళా విభాగ నూతన అధ్యక్షురాలిగా జమ్మికుంటకు చెందిన కందికట్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ పెద్దలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీల సంక్షేమం, ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.


