News April 15, 2025

నస్పూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

నస్పూర్ మండలం దొరగారి పల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారుగా 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుపు రంగు టీ షర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ఇతని ఆచూకీ తెలిపిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News November 26, 2025

ములుగు: సర్పంచ్ నేనే.. నాకు కన్ఫర్మ్ అయ్యింది!

image

ములుగు జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కాగా, పోటీలో ఉన్న అభ్యర్థులు టికెట్ వస్తుంది.. నన్ను కన్ఫామ్ చేశారంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారే నేనే సర్పంచ్ అంటే.. నేనే సర్పంచ్ అంటూ గ్రామాల్లో గప్పాలు కొడుతుండటంతో ఓటర్లు తికమక పడుతున్నారు.

News November 26, 2025

ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన.. ట్రాఫిక్ జామ్

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లలో భాగంగా కొన్ని మండలాల్లో బీసీలకు పంచాయతీలు రిజర్వ్ కాలేదన్నారు. రాస్తారోకో చేపట్టడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.

News November 26, 2025

‘కమ్లా పసంద్’ ఓనర్ కోడలు ఆత్మహత్య

image

పాపులర్ పాన్ మసాలా కంపెనీ ‘కమ్లా పసంద్’ ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా(40) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ వసంత్ విహార్‌‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకొని కనిపించారు. దీప్తి గదిలో పోలీసులు సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త హర్‌ప్రీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది. 2010లో దీప్తి-హర్‌ప్రీత్ వివాహం చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.