News March 24, 2025

నస్రుల్లాబాద్: చెరువులో పడి వ్యక్తి మృతి

image

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం నస్రుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన కీసరి రాములు(37) ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Similar News

News October 21, 2025

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా వాసి

image

తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై సమస్యల పోరాటాలు నిర్వహించారు.

News October 21, 2025

30 ఏళ్లకు పైగా ఒకే సినిమా… అయినా తగ్గని క్రేజ్

image

నేడు ఏ సినిమా అయినా వారం, పది రోజులు ఆడటమే కష్టం. అలాంటిది ఓ థియేటర్లో 30 ఏళ్లకు పైగా ఒకే సినిమా వేస్తున్నారంటే ఆశ్చర్యమే. ముంబైలోని మరాఠా మందిర్లో ‘దిల్‌వాలే దుల్హనియే లే జాయేంగే’ రిలీజైనప్పటి నుంచి ప్రదర్శితమవుతోంది. 1995 OCT20న ఇది రిలీజైంది. ‘30సార్లు ఈ మూవీ చూశా. ఇంకా చూస్తా’ అని 60 ఏళ్ల షక్రీ అన్నారు. 1975లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘షోలే’ 5ఏళ్లు ఆడగా DDLJ దాన్ని అధిగమించింది.

News October 21, 2025

రైల్వే,ఎన్‌హెచ్ ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి: జేసీ

image

విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడిన రైల్వే, జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆమె సమావేశం నిర్వహించి, జిల్లా పరిధిలోని రైల్వే, ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు సంబంధించిన స్థితిగతులపై సమీక్షించారు.