News April 4, 2025
నస్రుల్లాబాద్: చెరువులో మునిగి యువకుడి మృతి

కొల్లూర్ గ్రామానికి చెందిన అశోక్(19) అనే యువకుడు చేపలు పట్టేందుకు నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని దొంతిరెడ్డి చెరువుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహం గురువారం నీటిపై తేలడంతో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవ పంచానామా నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News April 18, 2025
విశాఖలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

విశాఖ సిటీ పరిధిలో దొంగతనానికి గురైన 9బైక్లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కోరాపుట్కి చెందిన అంతర్రాష్ట్ర దొంగలు కార్తీక్ కిల్లో, బాబుల సుపియాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల్లో రాయల్ ఎన్ ఫీల్డ్, యమహా, తదితర వాహనాలు ఉన్నాయి.
News April 18, 2025
ధరణి కారణంగా రైతులకు ఇబ్బందులు: మంత్రి

గతంలో అమల్లో ఉన్న ధరణి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వారికి ఇచ్చిన హామీ ప్రకారం 18 రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశపెట్టిందన్నారు. 45 రోజులు మార్పులు చేర్పులకు అవకాశం ఉందన్నారు. చట్టానికి వంద రోజుల్లో విధి విధానాలు అమలు చేసుకుందామన్నారు.
News April 18, 2025
ఎన్టీఆర్: ‘MLA సీటు త్యాగం.. పది నెలలుగా ఎదురుచూపులు’

మాజీ మంత్రి దేవినేని ఉమ 2024 ఎన్నికలలో తన సిట్టింగ్ మైలవరం స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్కు ఇచ్చారు. కూటమి గెలుపు అనంతరం ఉమకు MLC, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్ పదవి ఇవ్వనున్నారని వార్తలొచ్చినా చివరికి పదవి దక్కలేదు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు పదవులు ఇవ్వాల్సి రావడంతో ఉమకు టీడీపీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రానున్న రోజుల్లోనైనా ఉమ ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలి.