News July 11, 2024
నస్రుల్లాబాద్: పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ

పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన ఘటన నస్రుల్లాబాద్ మం.లో జరిగింది. పోలీసుల ప్రకారం.. శ్రీను, శ్రీకాంత్ అనే ఇద్దరు తమ తండ్రుల పేరిట ఉన్న ఇళ్లకు నకిలీ స్టాంపులు, పత్రాలు, రశీదులు, పంచాయతీ ధ్రువపత్రాలు తయారుచేశారు. అంతేగాక పంచాయతీ కార్యదర్శి రజిత సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఓ ఫైనాన్స్లో ఇద్దరు రుణాలు తీసుకొని చెల్లించకపోవటంతో సిబ్బంది ఆరా తీయగా విషయం బయటపడింది.
Similar News
News November 27, 2025
నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు: కలెక్టర్

నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించినట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించినట్లు పేర్కొన్నారు.
News November 27, 2025
నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News November 27, 2025
నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.


