News October 4, 2024

నాంపల్లి: ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్

image

ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.

Similar News

News November 20, 2025

దిల్‌సుఖ్‌నగర్ మెట్రోస్టేషన్ వద్ద అసభ్యకరంగా హిజ్రాలు.. అరెస్ట్

image

HYD చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద రాత్రిళ్లు రోడ్లపై నిల్చొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యువకులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఇద్దరు హిజ్రాలను సీఐ సైదులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

News November 20, 2025

HYD: ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలా?: పద్మారావు గౌడ్

image

HYDలో ఫార్ములా-ఈ నిర్వహణ తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిందని మాజీ మంత్రి, సికింద్రాబాద్ MLA టి.పద్మారావు గౌడ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ విజన్‌తో సాధ్యమైన ఈ గొప్ప కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసూయతో తప్పుడు కేసులు పెట్టించడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వారి వైఖరిని బయట పెడుతోందని వ్యాఖ్యానించారు.

News November 20, 2025

HYD: ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలా?: పద్మారావు గౌడ్

image

HYDలో ఫార్ములా-ఈ నిర్వహణ తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిందని మాజీ మంత్రి, సికింద్రాబాద్ MLA టి.పద్మారావు గౌడ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ విజన్‌తో సాధ్యమైన ఈ గొప్ప కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసూయతో తప్పుడు కేసులు పెట్టించడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వారి వైఖరిని బయట పెడుతోందని వ్యాఖ్యానించారు.