News December 27, 2024
నాంపల్లి ఎగ్జిబిషన్ 2025 విశేషాలు

జనవరి 1 నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్) 46 రోజులపాటు మహానగర వాసులను అలరించనుంది. ఈ 84వ నుమాయిష్లో 2,200 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. అంతేకాక పలు ప్రభుత్వ శాఖల స్టాళ్ల ఏర్పాటు చేస్తున్నారు. 160 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వేసి నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎంట్రీ ఫీజ్ రూ.50 (గతేడాది రూ.40)గా నిర్ణయించారు.
Similar News
News July 5, 2025
BREAKING: HYD: వికారాబాద్ విహారయాత్రలో మహిళలు మృతి

HYD నుంచి విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు మహిళలు శనివారం మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ మండలం సర్పన్పల్లి ప్రాజెక్టు సమీపంలోని వెల్డర్నెస్ రిసార్ట్కు HYDకు చెందిన రీటా కుమారి(55), పూనమ్ సింగ్(56) వచ్చారు. విహారయాత్రలో భాగంగా ఈరోజు సా.5 గంటలకు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తుండగా బోట్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News July 5, 2025
HYD: గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు.. GHMC ఆదేశాలు

HYDలో గేటెడ్ కమ్యూనిటీల్లో పోస్టుమాన్లకు ప్రవేశం, లిఫ్ట్ అనుమతి, పార్కింగ్ లేకపోవడంతో డెలివరీలకు ఇబ్బందులు తప్పటం లేదు. పోస్ట్మాస్టర్ జనరల్ ఫిర్యాదుపై జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు, RWAలు సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లిఫ్ట్ వినియోగం, పార్కింగ్, లెటర్బాక్స్ ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాక.. నివాసితులు ప్రతినిధులను నియమించాలని సూచించింది.
News July 5, 2025
HYD: అమెరికాలో మన పోలీస్కు ‘GOLD’ మెడల్

USలోని అల్బామాలో జరుగుతోన్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో HYD నివాసి సత్తాచాటారు. లక్డీకాపూల్లోని DGP ఆఫీస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావు(IGP స్పోర్ట్స్) ఇండోర్ రోయింగ్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించారు. జులై 6 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ గేమ్స్లో 80 దేశాల నుంచి దాదాపు 8500 మంది పాల్గొంటున్నారు. 50+ విభాగంలో మన కృష్ణారావు ఈ ఘనత సాధించడం గర్వకారణం.