News February 21, 2025
నాగర్కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం

తాడూరు మండల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తెలకపల్లి మండలం అనంతసాగర్కి చెందిన శ్రీను(42), శేఖర్(30)లు బైక్పై హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్ని తాడురు సమీపంలోని గుంతకోడూరులో ఓ కారు ఢీకొనగా.. ఇద్దరు కిందపడ్డారు. వీరి పైనుంచి ఆ కారు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు.
Similar News
News March 25, 2025
MBNR: ‘లంబాడీ గిరిజనులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి’

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి సంక్షేమానికి కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు నాయక్ కోరారు. MBNRలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తండాలను పంచాయతీలుగా, గోర్ బోలి భాషను 8 షెడ్యూల్లో, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, నిరుద్యోగ భృతి,గిరిజనులకు ట్రైకార్ రుణాలు మంజూరు చేసి న్యాయం చేయాలన్నారు. గిరిజన సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే అసెంబ్లీ ముట్టడి చేస్తామన్నారు.
News March 25, 2025
పాలమూరుకు మరో మంత్రి పదవి..!

పాలమూరు జిల్లాకు మరో మంత్రి రానుందని టాక్. మక్తల్ MLA వాకిటి శ్రీహరి ముదిరాజ్కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చ అనంతరం మంత్రివర్గ విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. మార్చి30న ఉగాది పండగ రోజు కొత్త మంత్రులు రానున్నారు.కాగా ఉమ్మడి MBNR నుంచి CM రేవంత్ రెడ్డి (కొడంగల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) మంత్రులుగా ఉండగా శ్రీహరితో ఆ సంఖ్య 3కు చేరనుంది.
News March 25, 2025
MBNR: ఈనెల 26వ తేదీన ఉద్యోగమేళ

ఈనెల 26వ తేదీన బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో నిర్వహించే ఈ ఉద్యోగమేళాకు విజయ ఫెర్టిలైజర్స్, ట్రెండ్స్, ధ్రువంత్ సొల్యూషన్స్ లాంటి సంస్థలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన 30 ఏళ్లలోపు యువకులు అర్హులని వెల్లడించారు.