News February 21, 2025
నాగర్కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం

తాడూరు మండల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తెలకపల్లి మండలం అనంతసాగర్కి చెందిన శ్రీను(42), శేఖర్(30)లు బైక్పై హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్ని తాడురు సమీపంలోని గుంతకోడూరులో ఓ కారు ఢీకొనగా.. ఇద్దరు కిందపడ్డారు. వీరి పైనుంచి ఆ కారు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు.
Similar News
News November 29, 2025
రాజమండ్రి: గోదావరి బాలోత్సవానికి సర్వం సిద్ధం

రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న గోదావరి బాలోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి, గోదావరి బాలోత్సవం ఛైర్మన్ దుర్గేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఈఓ కె. వాసుదేవరావు అతిథులుగా పాల్గొంటారు. జిల్లాలోని 145 పాఠశాలల నుంచి 8 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
News November 29, 2025
హైదరాబాదులో గుండ్లపల్లి మండల వాసి ఆత్మహత్య

నిరుద్యోగం, ఆర్థిక సమస్యలతో నల్గొండ(D) గుండ్లపల్లి(M) తవక్లాపూర్కు చెందిన ఆంజనేయులు(27) హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కోసం 8 నెలల క్రితం LBనగర్కు వెళ్లాడు. శుక్రవారం మ.1:10కి బంధువు అనిల్కు చనిపోతానని ఫోన్లో చెప్పాడు. విషయాన్ని వెంటనే సోదరుడు అభినందన్కు తెలియజేయగా అతను వెళ్లి చూసేసరికి ఉరేసుకొని కనిపించాడు. అతని సోదరుడు ఫిర్యాదు చేశాడని LBనగర్ సీఐ వినోద్ తెలిపారు.
News November 29, 2025
VKB: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా కీలక ఆదేశాలు జారీ

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను కఠినంగా అమలు చేయాలని SP స్నేహ మెహ్రా ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు రవాణా జరిగే ఆస్కారం ఉన్నందున తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, 8 అంతర్ జిల్లా చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు నిఘా ఉంచాలన్నారు.


