News February 21, 2025
నాగర్కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం

తాడూరు మండల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తెలకపల్లి మండలం అనంతసాగర్కి చెందిన శ్రీను(42), శేఖర్(30)లు బైక్పై హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్ని తాడురు సమీపంలోని గుంతకోడూరులో ఓ కారు ఢీకొనగా.. ఇద్దరు కిందపడ్డారు. వీరి పైనుంచి ఆ కారు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు.
Similar News
News November 19, 2025
HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.
News November 19, 2025
వైరా MLA చొరవ.. ఆర్మీ జవాన్ భార్యకు ఉద్యోగం

ఇటీవల కశ్మీర్లో ప్రమాదవశాత్తు మరణించిన వైరా నియోజకవర్గం సూర్యతండాకు చెందిన ఆర్మీ జవాన్ భార్య బానోత్ రేణుకకు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. జవాన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు కలెక్టర్తో స్వయంగా మాట్లాడి, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ఎమ్మెల్యే చూపిన చొరవకు తండా వాసులు, జవాన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
News November 19, 2025
టికెట్లు బుక్ చేసుకున్నారా?

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శించుకునే అదృష్టం లక్కీ డిప్లో ఎంపికైన వారికి లభిస్తుంది. అందుకు సంబంధించి ఫిబ్రవరి కోటా సేవా టికెట్లు నిన్న విడుదలయ్యాయి. TTD అధికారిక వెబ్సైట్లో రేపు ఉ.10 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు స్వామివారికి అతి చేరువలో ఉంటూ, కొన్ని నిమిషాల పాటు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ☞ టికెట్ ధరలు, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


